Vande Bharat : వావ్.. వందేభారత్ లో స్లీపర్ కోచ్ లు

వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలకు సంబంధించి 16 కోచ్లతో కూడిన రైలు ట్రయల్స్ విజయవంతంగా పూర్తైనట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. ప్రయాణికుల రవాణా కోసం రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ , కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతి పొందాల్సి ఉందని తెలిపింది. ట్రయల్ రన్ విశ్లేషించిన తర్వాత ఆర్డీఎస్వో తుది అనుమతి జారీ చేస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది. రైలు గరిష్ఠ వేగాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ అంచనా వేస్తారని తెలిపింది. ముంబయి-అహ్మదాబాద్ సెక్షన్లో 540కి.మీ మార్గంలో జనవరి 15న వందేభారత్ స్లీపర్ ట్రయల్రన్ నిర్వహించినట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది.
16 కోచ్ల వందే భారత్ స్లీపర్లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్, ఏసీ 3 టైర్ కోచ్లు ఉండనున్నాయి. ఈ ట్రెయిన్లో 1,128 మంది ప్రయాణించే వీలుంది. ఆటోమెటిక్ డోర్లు, కుషన్ బెర్తులు, వైఫై కూడా అందుబాటులో ఉండనుంది.
దేశంలో వందేభారత్ స్లీపర్ తొలి రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 17 డిసెంబర్, 2024న తయారు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. తొలుత దీనిని కోటా డివిజన్లో 30 నుంచి 40కి.మీ మధ్య పరీక్షించినట్లు తెలిపింది. మూడు రోజుల పాటు దీన్ని నిర్వహించామని, గంటకు 180కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించిందని రైల్వే బోర్డు పేర్కొంది. 2024 డిసెంబర్ 17న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 16 బోగీల వందే భారత్ స్లీపర్ను రైల్వే శాఖకు అప్పగించింది. తొలుత కోటా డివిజన్లో 30 నుంచి 40 కిలోమీటర్ల ట్రాప్పై పరీక్షలు నిర్వహించారు. ఈ ట్రెయిన్ 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్లో కూడా ఎలాంటి సమస్య లేకుండా పరుగులు పెట్టింది. రాబోయే రెండేళ్లలో వందే భారత్ స్లీపర్ ప్రొడక్షన్పై రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com