TCS CEO : టీసీఎస్ సీఈవో పారితోషికం రూ.26.5కోట్లు

X
By - Manikanta |29 May 2025 3:00 PM IST
దేశీయ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్స ల్టెన్సీసర్వీసెస్ (టీసీఎస్) సీఈవో కృతివాసన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.26.52 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారు. గతేడాదితో పోల్చితే ఇది 4.6శాతం అధికం. ఈ పారితోషికంలో శాలరీ 1.39కోట్లు కాగా, అలవెన్సులు, ఇతర ప్రయోజాల రూపం లో రూ.2.12కోట్ల పొందారు. ఇక కమీషన్ (లాభాల్లో వాటా) కింద రూ.23కోట్లు అందుకున్నారు. ఈ మేరకు టీసీఎస్ బుధవారం తన వార్షిక నివేదికలో వెల్లడిం చింది. కృతివాసన్ పారితోషికం సంస్థలో ఉద్యోగులకు చెల్లించే సగటు జీతం కంటే దాదాపు 30 రెట్లు అధికం కావడం విశేషం. ఇక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్రమణియన్ నెల వేతనం రూ.10.8 లక్షలుగా ఉంది. కృతివాసన్ 2023 లో సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com