Gold Price : బంగారం ధర భగ్గుమంది .. తులం లక్ష!

బంగారం ధర భగ్గుమంది. అందరూ ఊహించినట్టుగానే లక్ష మార్కు కుచేరువైంది. 24 క్యారెట్ల బంగారం ధర హై దరాబాద్ బులియన్ మార్కెట్ లో 99,600 రూపాయలు పలికింది. కిలో వెండి రూ.1,02, 100గా నమోదైంది. బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ఉండటం సాధారణం అయితే ఇవాల్టి ఓపెనింగ్ లక్ష దాటడం విశేషం. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా లక్ష దాటిన పసిడి ధరలు. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో లక్ష నుంచి 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 99 వేలు దాటింది. ఈ క్రమంలో నే.. తాజాగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం వరకు పలు వె బ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 99,600 వద్ద స్టార్టయి. లక్ష రూపాయలకు చేరింది. 22 క్యా రెట్ల ధర 90,910 గా ఉంది. వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,02,100లుగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com