Missing : తుంగభద్ర నదిలో స్నానం కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు

తుంగభద్ర నదిలో స్నానం కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పుష్కర ఘాట్ వద్ద జరిగింది. గల్లంతైన విద్యార్థులను రాయచూరుకు చెందిన చైతన్య (16), గగన్ (17), కార్తీక్ (17) గా గుర్తించారు. వీరంతా పదవ తరగతి పూర్తయిన తర్వాత సెలవుల కోసం కర్నూలులోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ముగ్గురు, మరో ఐదుగురు స్నేహితులతో కలిసి తుంగభద్ర పుష్కర ఘాట్కు స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా లోతు తెలియక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్ల సహాయంతో నదిలో గాలిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులలో తీవ్ర ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com