Toll Charges : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తగ్గిన టోల్ ఛార్జీలు

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలు తగ్గాయి. ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 1) నుంచి తగ్గిన రుసుములు అమల్లోకి రానున్నాయి. ఈ హైవేపై 3 టోల్ ప్లాజాలు (పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు) ఉన్నాయి. ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30 వసూలు చేయనున్నారు. ఇక లైట్ వేయిట్ వాహనాలను ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40 చార్జ్ చేయనున్నారు, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ చార్జాల్లో 25 శాతం మినహాయింపు ఇవ్వనున్నారు. గతంలో ప్రతీ ఏప్రిల్ 1న టోల్ చార్జీలు పెంచిన జీఎంఆర్. 2024 జూన్ 31తో జీఎంఆర్ ఒప్పందం ముగిసింది. అయితే, హైవే-65ను బీవోటీ పద్ధతిలో నిర్మించడంతో 2012 డిసెంబర్ నుంచి టోల్ వసూలు చేసిన జీఎంఆర్. ఒప్పందం 2024లో ముగియడంతో ఏడాది పాటు నిర్వాహణను ఏజెన్సీలకు అప్పగించిన ఎన్హెచ్ఏఐ. దీంతో, తాజాగా ఎన్హెచ్ఏఐ టోల్ నిర్వహణను చేపడుతుండటంతో ఛార్జీలు తగ్గాయి. టోల్ తగ్గించడంతో వాహనదారులకు ఊరట లభించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com