WhatsApp : వాట్సప్లో మరో కొత్త ఫీచర్

సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్లో మరో సదుపాయం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా వాట్సప్లోనూ ‘మెన్షన్’ ఫీచర్ను జోడించాలని చూస్తోంది. తాజాగా దాన్ని యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలేంటీ ఫీచర్? ఎలా ఉపయోగపడనుందంటే.. సాధారణంగా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అప్లోడ్ చేసేటప్పుడు నచ్చిన వ్యక్తులను ‘@’ సాయంతో ట్యాగ్ చేస్తుంటాం. అంటే సదరు వ్యక్తికి మనం స్టోరీ పెట్టినట్లు నోటిఫికేషన్ అందుతుంది. అలా వాళ్లు మన స్టోరీని చూస్తారు. అచ్చం అలాంటి సదుపాయాన్నే వాట్సప్ జోడించింది. దీంతో ఇకపై వాట్సప్లో స్టేటస్ పెట్టే సమయంలో కాంటాక్ట్లో నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేయొచ్చు. వాట్సప్లో స్టేటస్ అప్లోడ్ చేసే సమయంలో ‘యాడ్ క్యాప్సన్ అనే’ బార్కు కుడివైపున ‘@’ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ వాట్సప్లోని కాంటాక్ట్స్ అన్నీ దర్శనమిస్తాయి. వాటిలో మీకు నచ్చిన వ్యక్తులను మెన్షన్ చేయొచ్చు. స్టేటస్ అప్డేట్లో మెన్షన్ చేసినవారికి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అందుతుంది. అయితే ఇన్స్టా తరహాలో ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదని మెసేజింగ్ యాప్ ఇప్పటికే ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com