మావోయిస్టుల చేతిలో మాజీ సర్పంచ్‌ హత్య

మావోయిస్టుల చేతిలో మాజీ సర్పంచ్‌ హత్య
రాంథర్‌ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నారని లేఖలో ఆరోపించిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల మరోసారి రెచ్చిపోయారు. మాజీ సర్పంచ్‌ రాంథర్‌ అలంను దారుణంగా హత్య చేసారు. ఈ ఘటనను పోలీసు అధికారులు ధృవీకరించారు. మృతుడు బార్పూర్, హిట్‌మేట మాజీ సర్పంచ్‌గా గుర్తించారు.మాజీ సర్పంచ్‌ను చంపిన తర్వాత మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు. రాంథర్‌ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నారని లేఖలో ఆరోపించారు. మావోయిస్టు పార్టీకి ద్రోహం చేయ్యొద్దని పలుమార్లు హెచ్చరించామని పేర్కొన్నారు. అయినా తమ మాటలు వినకపోవడంతోనే రాంథర్‌ను చంపామని మావోయిస్టులు లేఖలో తెలిపారు. అటు ఐదు రోజుల వ్యవధిలో ముగ్గురు నేతలను మావోయిస్టులు హత్య చేయడం భయాందోళనలు రేపుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story