దేశంలో కోత్తగా 2,59,170 కేసులు.. 1761 మంది మృతి

X
By - TV5 Digital Team |20 April 2021 10:15 AM IST
దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తూనే ఉంది. కొన్ని రోజులుగా రోజుకు 2లక్షలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతుండడం మరింత ఆందోళన కలిస్తోంది
దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తూనే ఉంది. కొన్ని రోజులుగా రోజుకు 2లక్షలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతుండడం మరింత ఆందోళన కలిస్తోంది. గత 24 గంటల్లో 2 లక్షల 59 వేల 170 కేసులు.. 1761 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య కోటి53లక్షల 21వేల 089కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య లక్షా 80వేల 530కి చేరాయి. ఇక దేశంలో ప్రస్తుతం 20లక్షల31వేల977 యాక్టివ్ కేసులు ఉండగా.. కోటి 31లక్షల 08వేల 582 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో లక్షా 54వేల 761 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటు ఇప్పటివరకు 12కోట్ల 71లక్షల మందికి పైగా టీకాల పంపిణీ జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com