India coronavirus : దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..!

X
By - TV5 Digital Team |11 May 2021 10:44 AM IST
సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 18,50,110మందికి కరోనా పరీక్షలు చేయగా 3,29,942 మందికి కరోనా సోకింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 18,50,110మందికి కరోనా పరీక్షలు చేయగా 3,29,942 మందికి కరోనా సోకింది. అటు కరోనాతో 3,876మంది మరణించారు. కరోనాతో కొత్తగా 2,49,992మంది కరోనాను జయించారు. తాజాగా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.29కోట్లకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 2,49,992 మంది చనిపోయారు. ప్రస్తుతం 37,15,221 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 17.27కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com