దేశంలో కోత్తగా 3,32,730 కరోనా కేసులు.. 2,263 మంది మృతి

దేశంలో కోత్తగా 3,32,730 కరోనా కేసులు.. 2,263 మంది మృతి
గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 3 లక్షల 32 వేల 730 కేసులు నమోదు కాగా.. 2వేల 263 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజువారీ కేసుల్లో ప్రపంచ రికార్డు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉన్న అమెరికాను వరుసగా రెండవ రోజు కూడా వెనక్కి నెట్టివేసింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 3 లక్షల 32 వేల 730 కేసులు నమోదు కాగా.. 2వేల 263 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో కేసుల సంఖ్య కోటి 62 లక్షల 63 వేల 695కి చేరాయి. మరోవైపు మొత్తం మరణాల సంఖ్య లక్ష 86 వేల 920కి చేరాయి. ప్రస్తుతం 24 లక్షల 28 వేల 616 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కోటి 36 లక్షల 48 వేల 159 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 13 కోట్ల 54 లక్షల మందికి పైగా టీకాలు అందించారు.

Tags

Read MoreRead Less
Next Story