దేశంలో కొత్తగా 3,57,229 కరోనా కేసులు.. 3,449 మంది మృతి..!
By - TV5 Digital Team |4 May 2021 4:48 AM GMT
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే, మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడం కాస్త ఊరటనిస్తోంది.
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే, మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడం కాస్త ఊరటనిస్తోంది. అయినా సరే ఇంకా ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. గడిచిన 24 గంటల్లో 3 లక్షల 57వేల 229 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా కేసులు తగ్గినా సరే మరణాల సంఖ్యలో మాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3449 మంది చనిపోయారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2 లక్షల 22వేల 408కి చేరింది. మరోవైపు దేశంలో ఇప్పటి వకకు కరోనా సోకిన వారి సంఖ్య రెండు కోట్లను దాటింది. భారత్లో ఇప్పటి వరకు 2 కోట్ల 2 లక్షల 82వేల మందికి పైగా కరోనా సోకింది. దేశంలో ప్రస్తుతం 34 లక్షల 47వేల 133 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com