దేశంలో కొత్తగా 72 వేలకు పైగా కరోనా కేసులు...!

X
By - TV5 Digital Team |1 April 2021 11:15 AM IST
గడిచిన 24 గంటల్లో రికార్డు స్ధాయిలో దేశవ్యాప్తంగా 72 వేల 330 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా నమోదైన కేసులతో కోవిడ్ వైరస్ 72 వేల మార్క్ను దాటింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్ధాయిలో దేశవ్యాప్తంగా 72 వేల 330 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు కోటి 22 లక్షల 21 వేల 665కు చేరింది. గడిచిన 24 గంటల్లో 459 మంది కోవిడ్ బాధితులు మరణించారు. ఇప్పటివరకు కోటి 14 లక్షల 74 వేల 683 మంది కరోనా నుంచి కోలుకోగా.. కరోనాతో ఇప్పటివరకు లక్షా 62 వేల 927 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 5 లక్షల 84 వేల 55 యాక్టివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 6.51 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com