Coronavirus In India : దేశంలో కొత్తగా 89,129 కేసులు.. 714 మంది మృతి

X
By - TV5 Digital Team |3 April 2021 11:45 AM IST
Coronavirus In India : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు తాజాగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు తాజాగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 89,129 కేసులు నమోదుకాగా.. 714 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య కోటి 23లక్షల 92వేల 260కు చేరగా.. మరణాల సంఖ్య లక్షా 64వేల 110కు చేరుకుంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు కోటి 15లక్షల 69వేల 241 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6లక్షల 58వేల 909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com