కరోనా కష్టకాలంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం

X
By - shanmukha |11 Sept 2020 8:13 PM IST
కరోనా కష్టకాలంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి మృతి చెందినవారికి అంత్యక్రియలు ఖర్చుల కోసం
కరోనా కష్టకాలంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి మృతి చెందినవారికి అంత్యక్రియలు ఖర్చుల కోసం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కరోనా మృతుల మృతదేహాలు అందకపోయినా, అంత్యక్రియల ఖర్చులు భరించలేకపో్యినా బాధితుల కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తాన్ని నేషనల్ హెల్త్ మిషన్ నుంచి బాధిత కుటుంబాలకు ఈ సాయం అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అసోం ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com