బీహార్లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..
రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. బుధవారం సంభవించిన కరోనా మరణాలను రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జరిగిన COVID-19 మరణాలను బీహార్ ప్రభుత్వం తీవ్రంగా సవరించింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా సంబంధిత మరణాలు 5,500 వద్ద ఉన్నాయి. కాగా బుధవారం ముందు ఒక రోజే 3,951 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 9,429 కు చేరుకుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం మహమ్మారిని నివారించడంలో తన వైఫల్యాన్నిచాటుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజా గణాంకాల ప్రకారం, రెండవ తరంగంలో కోల్పోయిన ప్రాణాల సంఖ్య 8,000 కి దగ్గరగా ఉంది. ఏప్రిల్ నుండి మరణించిన వారి సంఖ్య దాదాపు ఆరు రెట్లు పెరిగింది. కోలుకున్నవారి సంఖ్యను ఆరోగ్య శాఖ మునుపటి రోజు 7,01,234 నుండి 6,98,397 కు సవరించింది. అంతకుముందు రోజు 98.70 శాతంగా ఉన్న రికవరీ రేటు కూడా గణాంకాల సవరణ తరువాత 97.65 శాతానికి పడిపోయింది.
పాట్నా జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,303 మంది మరణించారు. ముజఫర్పూర్ 609 మరణాలతో రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,15,179 మందికి వ్యాధి సోకింది, వీరిలో గత రెండు నెలల్లో ఐదు లక్షలకు పైగా ఈ అంటువ్యాధి బారిన పడ్డారు.
లాక్డౌన్ చేసిన నెల రోజుల కాలంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది. ఆరోగ్య శాఖ ప్రకారం, రోజులో కేవలం 20 మరణాలు మరియు 589 తాజా కేసులు మాత్రమే నమోదయ్యాయి. టీకా డ్రైవ్ ద్వారా పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com