మరో క్యాబినెట్‌ మంత్రికి కరోనా పాజిటివ్

మరో క్యాబినెట్‌ మంత్రికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా క్యాబినెట్‌ మంత్రికి కరోనా సోకింది.

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. యూపీలో కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రికి కరోనా సోకింది. మంత్రి సతీష్ మహానాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు సతీష్ పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా టెస్ట్ చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని మంత్రి అభ్యర్థించారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులు కరోనా బారినపడ్డారు. న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్‌, ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్, జలశక్తి మంత్రి మహేంద్ర సింగ్‌ కు కరోనా సోకింది. తాజాగా ఈ జాబితాలో మంత్రి సతీశ్‌ మహానా చేరారు. కరోనా మహమ్మారి బారిన పడి సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ ఇటీవలే ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story