దేశంలో మళ్లీ తిరగబెడుతున్న కరోనా మహమ్మారి

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తిరగబెడుతున్నట్లే కన్పిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజువారీ కేసుల సంఖ్య 25వేలకు చేరువైంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 8లక్షల 40వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 24వేల 882 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 2021లో నమోదైన అత్యధిక రోజువారీ కేసులివే. గతేడాది డిసెంబర్ 20న 26వేల 624 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ల సంఖ్య కోటి 13లక్షల 33వేల 728కి చేరింది. ఇప్పటివరకు మొత్తం కోటి 9లక్షల 73వేల 260 మంది కొవిడ్ను జయించారు. రికవరీ రేటు 96.82శాతంగా ఉంది.
కొన్ని రోజులుగా రికవరీ కేసుల కంటే.. కొత్త కేసులు ఎక్కువగా నమోదు కావడంతో దేశంలో యాక్టివ్ కేసులు మళ్లీ 2లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2లక్షల 2వేల 22 యాక్టివ్ కేసులుండగా.. ఈ రేటు 1.78శాతానికి పెరిగింది. ఇక 24 గంటల్లో మరో 140 మంది వైరస్తో చనిపోయారు. తాజా మరణాలతో దేశంలో మొత్తంగా 1లక్షా 58వేల 446 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైరస్ విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 64శాతం మహారాష్ట్రలోనే బయటపడుతున్నాయి. శుక్రవారం అక్కడ 15వేల 817మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 22లక్షల 82వేల191కి పెరిగింది.
మహారాష్ట్రలో కేసులు నమోదవడంతో ఐదు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే. చివరిసారిగా గతేడాది అక్టోబరు 2న 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో నిన్న మరో 56 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కరోనా ఉధృతి ఎక్కువగా మూడు జిల్లాల్లో లాక్డౌన్, కొన్ని ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com