మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 328 మంది మృతి

X
By - Admin |29 Aug 2020 9:32 PM IST
మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 16,867 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే కొత్తగా 16,867 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,64,281కు చేరింది. కరోనా మహామ్మారి బారిన పడి ఒక్కరోజే 328 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 24,103కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,85,131 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 5,54,711 మంది కోలుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com