6రాష్ట్రాల్లో 87వేలకు పైగా ఆరోగ్యకార్యకర్తలకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల కొరత ఏర్పడుతుంది. అటు, అదే సమయంలో చాలా మంది ఆరోగ్యకార్యకర్తలు కరోనా బారినపడటం.. ఉన్న సిబ్బందికి మరింత ఒత్తిడిపెరుగుతుంది. దేశంలోని 6 రాష్ట్రాల్లోనే 87 మందికిపైగా కరోనా బారినపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్లలో 87 వేలకుపైగా ఆరోగ్య కార్యకర్తలకు కరోనా సోకింది. 573 మందిని ఈ మహమ్మారి మింగేసింది. కర్ణాటకలో12,260 మంది, తమిళనాడులో 11,169 మంది, మహారాష్ట్రలో 24,000 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు కరోనా సోకినట్లు గుర్తించారు. మరోవైపు మహారాష్ట్రలో 292 మంది, కర్ణాటకలో 46 మంది, తమిళనాడులో 49 మంది ఆరోగ్య కార్యకర్తలు మృతిచెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com