కర్ణాటక ఉపముఖ్యమంత్రికి కరోనా

కర్ణాటక ఉపముఖ్యమంత్రికి కరోనా
కర్ణాటక ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ.. అక్కడ నమోదవుతున్న కేసులు అధికారులను

కర్ణాటక ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ.. అక్కడ నమోదవుతున్న కేసులు అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్‌కు కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. కరోనా సోకిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కూడా తెలిపారు. వైద్యుల సలహా మేరకు తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని నారాయణ్ ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతీఒక్కరూ కరోనా టెస్టు చేసుకొని ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. కాగా ఈ నెల 21 నుంచి కర్నాటకలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు 74 గంటల ముందు కరోనా పరీక్షలు చేసుకోవాలని స్పీకర్ ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story