కర్నాటకలో లక్ష మార్కు దాటిన కరోనా కేసుల సంఖ్య

X
By - shanmukha |10 Sept 2020 8:49 PM IST
కర్నాటకలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతీరోజూ వంద మందికి పైగా
కర్నాటకలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతీరోజూ వంద మందికి పైగా కరోనా కాటుకి బలైపోతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,217 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,30,947కు చేరింది. ఈ ఒక్కరోజే కరోనాతో 129 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 6,937కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,22,454 మంది కోలుకోగా.. ఇంకా 1,01,537 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com