మహారాష్ట్రలో కరోనా మృత్యుఘోష.. 27వేలకు పైగా మరణాలు

X
By - shanmukha |8 Sept 2020 8:30 PM IST
మహారాష్టలో కరోనా మహమ్మారి మృత్యుఘోష మోగిస్తుంది. గడిచిన 24 గంటల్లో 16,429 మంది కరోనా బారినపడగా.. 423 మంది
మహారాష్టలో కరోనా మహమ్మారి మృత్యుఘోష మోగిస్తుంది. గడిచిన 24 గంటల్లో 16,429 మంది కరోనా బారినపడగా.. 423 మంది కరోనాతో మృతి చెందారు. గత కొంతకాలంగా 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. ఈ రోజు కరోనా కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే, కరోనా మరణాలు మాత్రం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఆందోళన మొదలైంది. ఈ రోజు నమోదైన మరణాలతో కరోనా మృతుల సంఖ్య 27,027కి చేరింది. అటు, రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 9,23,641కి చేరగా.. 6,59,322మంది రికవర్ అయ్యారు. ఇంకా 2,36,934 చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com