Delhi: అసభ్య కామెంట్లు చేసిన వారిపై కేసు...
భారత స్టార్ క్రికెటర్లైన ధోని, విరాట్ కోహ్లీ కూతుర్లపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన వారిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే వామిక రెండవ పుట్టినరోజు సందర్భంగా విరాట్,అనుష్క కలిసి తమ పాపతో దిగిన ఫోటొను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా గుర్తితెలియని వారు అసభ్యంగా కామెంట్లు పెట్టారు.
వాటిపై స్పందించిన DCWC ఛీఫ్ స్వాతి మలివాల్ ఆ కామెంట్లను స్క్రీన్ షాట్ చేసి తమ పై వెంటనే కేసు నమోదు చేయాలని, రెండేళ్ల వామికా,ఏడేళ్ల జీవా పై అలాంటి నీచమైన కామెంట్లు చేస్తారా? ఆటగాళ్లు నచ్చకపోతే వారి కూతుళ్లను తిడతారా? అంటూ ట్వీట్ చేసింది. దాని పై స్పందించిన ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారని స్వాతి FIR కాపీని జత చేస్తూ ట్వీట్ చేేసింది. నిందితులు ఎవరైనా వారిని త్వరగా పట్టుకోవాలని స్వాతి డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com