Delhi: దేశ రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
By - Prasanna |12 March 2022 6:12 AM GMT
Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని గోకల్పురి గ్రామంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారని అధికారి శనివారం తెలిపారు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని గోకల్పురి గ్రామంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారని అధికారి శనివారం తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని గోకల్పురి గ్రామం పిల్లర్ నంబర్ 12 సమీపంలో తెల్లవారుజామున 1.00 గంటకు అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్నారు అధికారులు.
దీంతో వెంటనే స్పందించిన ఫైర్ ఇంజన్ సిబ్బంది 13 ఫైర్ టెండర్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. అప్పటికే దాదాపు 60 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఏడుగురు సజీవదహనమయ్యారు. శనివారం తెల్లవారు జామున 4 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయని ఈశాన్య ఢిల్లీ అడిషినల్ డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com