సీరంలో అగ్ని ప్రమాదం: బాధిత కుటుంబాలకు 25లక్షల పరిహారం
By - TV5 Digital Team |21 Jan 2021 3:22 PM GMT
పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న భవంతిలో ప్రమాదం జరిగిందని పుణె మేయర్ మురళీధర్ తెలిపారు.
పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న భవంతిలో ప్రమాదం జరిగిందని పుణె మేయర్ మురళీధర్ తెలిపారు. అయితే అగ్ని ప్రమాదంలో మరణించిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు సీరమ్ ఇన్స్టిట్యూట్ పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో బాధకు గురిచేసిందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ కూడా సంతాపం తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com