Heeraben Modi Death: ప్రధాని మోదీకి సానుభూతి తెలిపిన రాహుల్‌ గాంధీ

Heeraben Modi Death: ప్రధాని మోదీకి సానుభూతి తెలిపిన రాహుల్‌ గాంధీ
ప్రధాని మోదీకి సానుభూతి తెలిపిన రాహుల్‌ గాంధీ; మోడీ తల్లి హీరాబెన్ మృతికి పలువురి సంతాపం

ప్రధాని మోదీకి సానుభూతి తెలిపిన రాహుల్‌ గాంధీ


ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపాలు తెలిపారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గుజరాత్​ సీఎం భూపేంద్ర పాటిల్, రక్షణశాఖ మంత్రి రాజనాథ్​ సింగ్ తో పాటు, ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్​, మధ్యప్రదేశ్​ సీఎం శివ్​ రాజ్​ సింగ్​ చౌహాన్​, కేంద్ర మంత్రి అమిత్​ షా మోదీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. హీరాబెన్ మరణ వార్త తనను ఎంతగానో కలిచివేసిందని, ఎంతో బాధాకరమని రాహుల్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ప్రధానికి తన సానుభూతి, ప్రేమ తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి పార్ధివ దేహాం పాడెను మోశారు. ఈ అంతిమయాత్రలో పాల్గొనేందుకు మోదీ సన్నిహితులకు మాత్రమే అనుమతించారు.




Tags

Read MoreRead Less
Next Story