భారత్ లో కరోనా కల్లోలం.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు

భారత్ లో కరోనా కల్లోలం.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు
భారత్ లో కరోనా కల్లోలం.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు

మూమూలుగా లేదు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 79 వేల కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇదో రికార్డు. జులై 25న అమెరికాలో ఒక్కరోజులో 78 వేల 427 కేసులు నమోదైతే ఇప్పుడు మన దగ్గర 78 వేల 903 కేసులు వచ్చాయి. USలో 76 వేలకుపైగా కేసులు పలు సందర్భాల్లో నమోదైనా.. ఈ వారం రోజుల నుంచే భారత్‌లో కరోనా మీటర్ మరింత పైపైకి వెళ్తోంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే దేశంలో 4 లక్షల 96 వేల మంది అంటే దాదాపుగా 5 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటేసింది. దేశవ్యాప్తంగా సగటున గత వారం రోజులుగా 70 వేల 867 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్న ఒక్కరోజే ఏకంగా 945 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఇప్పటికీ మహారాష్ట్రలో కరోనా కబళిస్తూనే ఉంది. నిన్న అక్కడ 16 వేల 867 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ప్రస్తుతం కేసుల తీవ్ర తగ్గి 6 వేలకు వచ్చినా గతంలో నమోదైన పాజిటివ్ కేసుల్ని బట్టి చూస్తే దేశంలో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఏపీలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల 548 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కోవిడ్‌ వల్ల 82 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసులు 4 లక్షల 14 వేలు దాటేసింది. ఏపీలో ఇటీవల రోజు 10 వేల కేసులు సరాసరిన నమోదవుతుండండతో గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్ భయం కనిపిస్తోంది. కర్నాటక, యూపీల్లోనూ కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను ఓసారి చూస్తే ఇప్పటికీ అమెరికానే తీవ్రంగా ఎఫెక్ట్ అయిన లిస్టులో ఫస్ట్ ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ ఉంటే, 3వ స్థానంలో భారత్ ఉంది. అమెరికాలో మరణాలు కూడా ఇప్పటికి లక్షా 87 వేలకు చేరువ అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story