దేశంలో వరుసగా రెండోరోజూ 2 లక్షలు దాటిన కరోనా కేసులు.. !

X
By - TV5 Digital Team |16 April 2021 2:04 PM IST
ఇండియాపై కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడింది. సరికొత్త రికార్డును నమోదు చేస్తూ రెండు లక్షల 16వేల 850 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
ఇండియాపై కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడింది. సరికొత్త రికార్డును నమోదు చేస్తూ రెండు లక్షల 16వేల 850 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రెండు లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడడం వరుసగా ఇది రెండోరోజు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోటి 42 లక్షల 87వేల 740 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా దేశంలో లక్షా 74వేల 335 మంది చనిపోయారు.
ఎప్పటిలాగే కరోనా కేసులలో మహారాష్ట్రనే అగ్రస్థానం నిలిచింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 61వేల 695 కేసులు బయటపడ్డాయి. 349 మంది కరోనాతో చనిపోయారు. ఢిల్లీలో 16వేల 699 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్లోనూ కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. నిన్న ఒక్క రోజే 6వేల 769 కేసులు బయటపడ్డాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com