Omicron Death : భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు..!

Omicron Death : భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు..!
Omicron Death : ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది.. భారత్ లోనూ ఈ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది.

Omicron Death ; ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది.. భారత్ లోనూ ఈ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1270 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశంలో మొదటి ఒమిక్రాన్‌ మరణం నమోదయింది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు(52) గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించాడు. ముందుగా అతను గుండెపోటుతో చనిపోగా, ఆ తర్వాత ఒమిక్రాన్ పాజటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఇక చనిపోయిన వ్యక్తికి ట్రావెల్‌ హిస్టరీ ఉందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అతను గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story