భారత్‌లో కోత్తగా 3,52,991 కరోనా కేసులు.. 2, 812 మంది మృతి

భారత్‌లో కోత్తగా 3,52,991 కరోనా కేసులు.. 2, 812 మంది మృతి
భారత్‌లో ఇవాళ కూడా రికార్డ్‌ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 3 లక్షల 52 వేల 991 మందికి కరోనా సోకింది.

భారత్‌లో ఇవాళ కూడా రికార్డ్‌ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 3 లక్షల 52 వేల 991 మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2వేల 812 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా రోజుకు రెండువేలకు మించి కరోనా కారణంగా చనిపోతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లక్షా 95 వేల 123 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు కూడా ప్రతిరోజు దిగజారుతోంది. 83.5 శాతం నుంచి 82.6 శాతానికి రికవరీ రేటు పడిపోయింది. ప్రస్తుతం భారత్‌లో 28 లక్షల 13వేల 658 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 14 కోట్ల 19 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story