Corona Deaths In India : కరోనా మరణాల్లో మూడో స్థానంలో భారత్..!

Corona Deaths In India : దేశంలో రెండో దశ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా మూడు లక్షలకు దిగువనే కరోనా కేసులు నమోదు అవ్వడం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా మరణాల సంఖ్య కలవర పెడుతుంది. నిన్న రెండు లక్షల ఇరవై రెండు వేలు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్ల 67 లక్షల 52వేలు దాటేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 27లక్షల 20వేలకి పైగా ఉన్నాయి.
ఇక రికవరీ రేటు 88.3%గా ఉంది. ఇక మరణాల రేటు 1.13%గా ఉంది. ఇక కరోనా కల్లోల్లం లక్షలాది మందిని బలి తీసుకుంటునే ఉంది. గత 24 గంటల్లో 4452 మంది మరణంతో మృతుల సంఖ్య మూడు లక్షలు దాటింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో మూడో స్థానంలో భారత్ ఉంది. గత కొద్ది రోజులుగా క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్న మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. మరికొద్ది రోజుల్లో సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతుందని కేంద్రం చెబుతున్న కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు పల్లెలోనూ వైరస్ వేగంగా విస్తరించడం టెన్షన్ పెడుతుంది.
దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు మూడు లక్షల మూడు వేల ఏడు వందల యాబై ఒక్క మంది మృతి చెందారు. ఈ పన్నెండు రోజుల్లోనే 50 వేల మంది వైరస్ కి బలైపోయారు. గత 26రోజుల్లో లక్ష మందికి పైగా మృతి చెందారంటే ఈ సెకండ్ వేవ్ ఎంత భయానక పరిస్థితులను సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో అరు లక్షల మంది మరణిస్తే.. బ్రెజిల్ లో నాలుగు లక్షల యాబై వేల మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ స్థాయిలో కరోనా మరణాల్లో పడింది మనదేశమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com