భారత మహిళల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ..!

భారత మహిళల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ..!
టోక్యో ఒలింపిక్స్‌లో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు తీవ్ర భావోద్వేగానికి లోనయింది. పసిడి పతకం సాధించలేకపోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు తీవ్ర భావోద్వేగానికి లోనయింది. పసిడి పతకం సాధించలేకపోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రధాని మోదీ.. టీమ్ ప్లేయర్స్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. హాకీ ప్లేయర్లు, కోచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని.. వారిని అభినందించారు. ఒలింపిక్స్‌లో సమిష్టి కృషితో రాణించారని కితాబిచ్చారు. నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని మోదీ చెప్పారు. దేశంలోని కోట్లాది మంది అమ్మాయిలకు మీరు ఆడిన ఆట స్పూర్తిగా నిలుస్తుందని మహిళల హాకీ జట్టుకు ప్రధాని మోదీ ధైర్యం చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story