Danish Siddiqui : దివంగత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు..!

Danish Siddiqui :  దివంగత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు..!
Danish Siddiqui : తాలిబన్ల కిరాతకానికి బలైపోయిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది.

Danish Siddiqui : తాలిబన్ల కిరాతకానికి బలైపోయిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది. ఫీచర్​ ఫొటోగ్రఫీ కేటగిరీలో సిద్ధిఖీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది పులిట్జర్ బోర్డ్. దేశంలో కరోనా విలయాన్ని కళ్లకుగట్టేలా ఫొటోలు తీసినందుకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు పేర్కొంది.

డానిష్ సిద్ధిఖీని పులిట్జర్​ పురస్కారం వరించడం ఇది రెండోసారి. 2018లో రోహింగ్యాల సంక్షోభాన్ని కవర్ చేసినందుకు ఈ అవార్డు దక్కింది. అటు 2021 జులైలో అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు, భద్రతా బలగాలకు మధ్య పోరును కవర్ చేసే క్రమంలో సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు.

అయితే సిద్దీఖి మరణం ఆకస్మికంగా జరిగింది కాదని అమెరికా పత్రిక​ ఓ కథనం ప్రచురించింది. కాగా ఇండియాలోని రాయిటర్స్ సంస్థలో చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా పని చేసిన సిద్ధిఖీ.. ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశాడు. సిద్ధిఖీకి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story