కర్నాటకలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 128 మంది మృతి

X
By - shanmukha |5 Sept 2020 9:08 PM IST
కర్నాటకలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. కరోనా టెస్టుల సంఖ్య పెరిగే కొద్ది కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.
కర్నాటకలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. కరోనా టెస్టుల సంఖ్య పెరిగే కొద్ది కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 9,796 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నాటకలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,89,232కు చేరింది. అయితే, ఇందులో ఇప్పటి వరకూ 2,83,298 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 99,617 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ రోజు నమోదైన 128 మరణాలతో.. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 6,298కి చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com