Madhya Pradesh : ఐదు అంతస్థుల హోటల్ లో అగ్ని ప్రమాదం

X
By - Vijayanand |29 March 2023 12:21 PM IST
రావులో ఉన్న పాపాయ ట్రీ హోటల్ లోని కేఫ్ ప్రాంతంలో ముందుగా మంటలు అంటుకున్నట్లు తెలిపారు
మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ బహుళ అంతస్థుల హోటల్ లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు మూడు ఫైర్ ఇంజన్లు శ్రమిస్తున్నాయి. ఇండోర్ లోని ఐదు అంతస్థుల భవనంలోని ఓ హోటల్ లో మంటలు అంటుకున్నట్లు పోలీసులు తెలిపారు. రావులో ఉన్న పాపాయ ట్రీ హోటల్ లోని కేఫ్ ప్రాంతంలో ముందుగా మంటలు అంటుకున్నట్లు తెలిపారు. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయని చెప్పారు. ప్రస్తుతం రెండు అంతస్థులను మంటలు చుట్టుముట్టినట్లు తెలిపారు. మూడు అగ్నిమాపక యంత్రాలు, ఐదు వాటర్ ట్యాంకర్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హెటల్ నుంచి మహిళలను, పిల్లలతో సహా అందరినీ రక్షించినట్లు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com