సీఎం పేషీలో ఇద్దరికి పాజిటివ్..

తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒకరు నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఒక అధికారి సీఎంకు అతి సన్నిహితంగా మసలుతుంటారు.. సీఎం పాల్గొనే ప్రతి సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే సినిమా పరిశ్రమకు చెందిన మెగా బ్రదర్ నటుడు నాగబాబు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,62,844కు చేరింది. వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 996 కు చేరింది. కొత్తగా కరోనా సోకిన కేసుల సంఖ్య హైదరాబాదులో 325, కరీంనగర్ లో 122, ఖమ్మంలో 97, మేడ్చల్ ల 164, రంగారెడ్డి లో 185, సిద్ధిపేటలో 91, వరంగల్ అర్బన్ లో 114, నల్లగొండలో 175, నిజామాబాద్ లో 91 కేసులు నమోదయ్యాయి. 1,31,447 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com