మోదీ క్రేజ్ మాములుగా లేదుగా..!
By - Gunnesh UV |29 July 2021 10:45 AM GMT
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రియాశీల రాజకీయ నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు..
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రియాశీల రాజకీయ నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు.. అయన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 70 మిలియన్ల మార్క్ దాటేసింది. 2009లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు మోదీ. 2010లో లక్ష మంది ఫాలోవర్స్ చేరగా.. 2011 నవంబర్లో ఫాలోవర్స్ సంఖ్య 4 లక్షలకు చేరింది. ఇక దేశ ప్రధాని అయ్యాక ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకునేందుకు మోదీ ట్విట్టర్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో 26.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి 19.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com