ప్రధాని మోదీకి తమిళ సంస్కృతిపై గౌరవం లేదని రాహుల్ ఫైర్
By - Nagesh Swarna |27 Jan 2021 3:30 AM GMT
కోయంబత్తూర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. మోదీపై విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీకి తమిళ సంస్కృతిపై గౌరవం లేదంటూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్... మోదీపై విరుచుకుపడ్డారు.
తమిళనాడులోని తిరుప్పూర్, ఈరోడ్, కరూర్ జిల్లాలో మూడు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పలు రోడ్ షోల్లో పాల్గొనడంతోపాటు.. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, రైతులతో మాట్లాడుతారు.
అయితే... AIDMKకు గట్టి పట్టు ఉన్న ఈ మూడు జిల్లాల్లో రాహుల్ పర్యటన సాగడం విశేషం. స్థానిక అభ్యర్థి తరపున.. కోయంబత్తూర్లోని రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. భారత్లోని విభిన్న సంస్కృతులను, భాషలను కాంగ్రెస్ గౌరవిస్తోందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com