Rahul Gandhi : మా నాన్నను చాలా మిస్ అవుతున్నా : రాహుల్ గాంధీ

Rahul Gandhi : మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ప్రత్యేక వీడియో ట్వీట్ చేశారు. ఆ వీడియోలో రాజీవ్ పాలనలోని సంస్కరణలు, పథకాల గురించి అందులో వివరించారు. " మా నాన్న దూరదృష్టి కలిగిన నాయకుడు.. ఆయన విధానాలు ఆధునిక భారత్ కి తోడ్పడ్డాయి.. నాకు ప్రియాంకకి అద్భుతమైన తండ్రి.. ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను" అని రాహుల్ ట్వీట్ చేశారు.
అటు దేశ రాజధాని ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. ఇక రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆయనకు నివాళులర్పించారు.
1944 ఆగస్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీని తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో మే 21, 1991న ఎన్నికల ర్యాలీ సందర్భంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ( ఎల్టీటీఈ ) ఆత్మాహుతి బాంబర్చే హతమార్చారు . కాగా రాజీవ్ గాంధీ డిసెంబర్ 2, 1989 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు.
My father was a visionary leader whose policies helped shape modern India.
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2022
He was a compassionate & kind man, and a wonderful father to me and Priyanka, who taught us the value of forgiveness and empathy.
I dearly miss him and fondly remember the time we spent together. pic.twitter.com/jjiLl8BpMs
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com