Road Accident: కుమారుడి చికిత్సకు వెళుతూ ప్రాణాలు కోల్పోయిన దంపతులు..

Road Accident: కుమారుడి చికిత్సకు వెళుతూ ప్రాణాలు కోల్పోయిన దంపతులు..
Road Accident: కేఎస్ఆర్టీసీ బస్సు లారీని ఢీకొని దంపతుల మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 4 ఏళ్ల బాలుడు నిశ్చయ్ వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

Road Accident: కేఎస్ఆర్టీసీ బస్సు లారీని ఢీకొని దంపతుల మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 4 ఏళ్ల బాలుడు నిశ్చయ్ వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కేఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, వారి నాలుగేళ్ల కుమారుడు సహా 26 మంది గాయపడ్డారు.

బెంగళూరులోని శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న బాలమురుగన్‌(35), అతని భార్య సెల్వి(29) మృతి చెందారు. చిత్తూరు జిల్లా బలిజకండ్రిగ నుంచి బస్సు బెంగళూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గ్రానైట్ లారీ బ్రేక్‌డౌన్‌ కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉంది. ఆ విషయాన్ని బస్ డ్రైవర్‌ గమనించలేదు. దాంతో స్పీడుగా వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టింది.

బస్సు డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడి ప్రైవేట్ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్‌గా చికిత్స పొందుతున్నాడు. మరో 26 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆరుగురికి పైగా ప్రయాణీకులు వివిధ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు.

బాలమురుగన్, అతని భార్య, కుమారుడు బస్సు ఎడమ వైపున డ్రైవర్ పక్కన కూర్చున్నారు. ఈ ప్రమాదంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బతినడంతో వారు అక్కడికక్కడే మరణించారు. బస్సు డ్రైవర్‌పై హోస్కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వాహనాలను సీజ్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story