ఘోర రోడ్డుప్రమాదం.. గర్బిణీ సహా ఏడుగురు మృతి

X
By - shanmukha |27 Sept 2020 1:14 PM IST
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కలబురిగి జిల్లాలో సవలగి గ్రామ శివార్లులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. అయితే, మృతుల్లో ఒక గర్భిణీ కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు సహా కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా అలండ్ పట్టణానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. గర్భిణీని ప్రసవం కోసం కలబురిగికి తీసుకువస్తుండగా ప్రమాదానికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com