వాటే క్రేజీ కాంబినేషన్.. ఫ్యాన్స్ ఫిదా

వాటే క్రేజీ కాంబినేషన్.. ఫ్యాన్స్ ఫిదా
హైట్ పెద్ద విషయం కాకపోతే ఆమె తన పక్కన పక్కాగా సూట్ అవుతుందని ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రచారానికి నాంది

ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్ పక్కన నటించిన సాయిపల్లవి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్‌కు తెర లేపింది.. విరాటపర్వంలో రాణాతో, సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. అయితే ఈలోపే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీకి సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఫిల్మ్‌నగర్‌లో ఈ వార్త హాట్ టాపిగ్గా మారింది.

హైట్ పెద్ద విషయం ఏం కాకపోతే ఆమె తన పక్కన పక్కాగా సూట్ అవుతుందని ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రచారానికి నాంది పలుకుతున్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో 'సలార్' చిత్రం తీయడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవిని ఎంపిక చేసే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే అందులో ఒకరు సాయి పల్లవి కావొచ్చనేది సమాచారం. దీంతో సాయిపల్లవి నటించే తొలి పాన్ ఇండియా మూవీ ఇదేనంటూ ప్రచార పర్వం సాగుతోంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి హీరోలకు మోస్ట్ ఫేవరెట్‌గా మారింది. అందుకేనేమో రెమ్యునరేషన్‌ కూడా భారీగానే అందుకుంటోందట..

పవన్ కళ్యాణ్‌తో నటించబోయే సినిమాకు రూ.2 కోట్లు డిమాండ్ చేసిందట.. నాతో పెట్టుకుంటే బొక్కలిరగ్గొడతా అని ఫిదా డైలాగ్‌లాగే.. మరి సాయి పల్లవి కావాలంటే నిర్మాతలు ఆ మాత్రం చెల్లించాల్సిందే..

Tags

Read MoreRead Less
Next Story