Tamilnadu : వలసకార్మికులు సురక్షితంగా ఉన్నారు : మంత్రి ఈవీ వేలు

X
By - Vijayanand |8 March 2023 12:59 PM IST
రాష్ట్రంలో నివసిస్తున్న ఉత్తరాది వలసకార్మికుల పిల్లలు సుమారు 1250 మంది చదువుకుంటున్నారని తెలిపారు
తమిళనాడులో ఉన్న వలసకార్మికుల సురక్షితంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి ఈవీ వేలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివసిస్తున్న ఉత్తరాది వలసకార్మికుల పిల్లలు సుమారు 1250 మంది చదువుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో నివసిస్తున్న ఉత్తరాదికి చెందిన కార్మికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. రెండు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడులోనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ఇక్కడ భద్రత ఉంది కాబట్టే సుమారు 1250 మంది పిల్లలు నీలగిరిలోని అంగన్ వాడీలలో చదువుకుంటున్నారని స్పష్టం చేశారు. ఉదగై ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను మంత్రి వేలు పరిశీలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com