సర్వస్వం కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలిచిన అండమాన్ నికోబార్ టీడీపీ ఇంఛార్జ్ మాధవ నాయుడు
By - TV5 Digital Team |10 Dec 2021 12:10 PM GMT
జైలు పాలై సర్వస్వం కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలబడ్డారు అండమాన్ నికోబార్ టీడీపీ ఇంఛార్జ్ మాధవ నాయుడు.
జైలు పాలై సర్వస్వం కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలబడ్డారు అండమాన్ నికోబార్ టీడీపీ ఇంఛార్జ్ మాధవ నాయుడు. వారికి దుస్తులతో పాటు నిత్యావసరాలు అందించారు. కొద్దిరోజుల కిందట అండమాన్ నికోబార్ కు చెందిన పలువురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పొరపాటున బర్మాలోకి ప్రవేశించారు. దీంతో వారిని అక్కడి ప్రభుత్వం జైళ్లో వేసింది. బర్మా సర్కారుతో మాట్లాడి మత్స్యకారులను ఢిల్లీ రప్పించింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీకి చేరుకున్న మత్స్యకారులకు అండమాన్ TDP అధ్యక్షుడు ఎన్. మాణిక్యరావు యాదవ్ సమక్షంలో బట్టలు, నిత్యావసరాలు అందజేశారు మాధవనాయుడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com