విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..!
By - TV5 Digital Team |10 March 2021 11:15 AM GMT
సొంత గనులు లేకపోవడం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు ఒక కారణమని... కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు.
సొంత గనులు లేకపోవడం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు ఒక కారణమని... కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన... సొంత గనులు లేనందున ముడి ఖనిజాన్ని ఓపెన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. తమకు గనులు కేటాయించాలని ఒడిషా, చత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను RINL కోరిందని.. కేంద్ర ఉక్కు శాఖ కూడా ఒడిషా సర్కారును ఈ మేరకు అభ్యర్థన చేసిందని తెలిపారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సొంతంగా బొగ్గు, ఇనుప ఖనిజం గనులున్నాయని... అందుకే కొంతకాలం నష్టాల్లో ఉన్నా.. తిరిగి ఆ సంస్థ లాభాల్లోకి వచ్చిందని ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో వివరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com