UP : గుడిసెలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

UP : గుడిసెలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ దేహత్ లోని ఓ గుడిసెలో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో కుటుంబం సజీవదహనమైంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన రూరా పోలీస్టేషన్ పరిధిలోని హర్మౌ బంజరదేవా గ్రామంలో చోటుచేసుకుంది. సతీష్ కుమార్, ఆయన భార్య కాజల్, ముగ్గురు పిల్లలు నిద్రిస్తుండగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేకున్న అగ్ని మాపక సిబ్బంది స్థానికులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన సతీష్ తల్లికి గాయాలయ్యాయి. ఆమెను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దించారు. "'సతీష్, అతని కుటుంబ సభ్యులు అగ్నిప్రమాదంలో సజీవదహనం అయ్యారు. మేము ఫోరెన్సిక్ బృందం, అగ్నిమాపక శాఖ అధికారులు, డాగ్ స్క్వాడ్ బృందంతో విచారణ కొనసాగిస్తున్నాము" అని చెప్పారు కాన్పూర్ దేహత్ ఎస్పీ. సతీష్ తల్లి చికిత్స పొందుతున్న జిల్లా హాస్పిటల్ ను ఎస్పీ సందర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story