గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లలను ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేసింది. 899 పోస్టులకు సంబంధించి 4 లక్షల 83 వేల 525 మంది ధరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 537 మంది పోటీపడుతున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 : 30 గంటల నుంచి ఒంటి గంటవరకు పరీక్ష జరగనుంది. గ్రూప్-2 అభ్యర్థులు www.psc.ap.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని ఏపీపీఎస్సీ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకొవాలని విజ్ఞప్తి చేసింది. అలాగే.. గ్రూప్-2 పరీక్ష వాయిదా అంటూ వస్తున్న వార్తలను అభ్యర్థులు నమ్మొద్దని.. యథాతథంగా షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తామని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com