NEET PG Exams : ఆగస్టు 3న నీట్ పీజీ.. ఒకే షిఫ్ట్ నిర్వహణకు సుప్రీం ఆమోదం

మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 3న జాతీయ స్థాయిలో ఒకే షిఫ్ట్లో నీట్-పీజీ 2025 పరీక్షను నిర్వహించడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ)కి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ పరీక్షను నిర్వహించడానికి రెండు నెలల కంటే ఎక్కువ సమయం కోరడాన్ని మొదట ప్రశ్నించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం, ఆ తర్వాత కారణాలు నిజాయితీగా ఉన్నాయని పేర్కొంది. అయితే నీట్ పీజీ పరీక్షను నిర్వహించడానికి ఎన్టీఈకి సమయం ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మే 30న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన షిఫ్ట్ నిర్వహించాల్సి తెలిపింది. అందువల్ల దాదాపు 1,000 పరీక్షా కేంద్రాలు అవసరమంది.
జూన్ 15న జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహి స్తామని ఎన్బీఈ పేర్కొంది.వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే నీటిక్కు సంబంధించి సుప్రీంకోర్టు మే 30న కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15న జరగనున్న నీట్-పీజీ 2025 ను ఒక షిఫ్ట్లోనే ముగించాలని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com