AP : జగన్ కు బుద్ధి చెప్పడానికి ఉత్తరాంధ్ర ప్రజలు రెడీ : బుద్దా వెంకన్న

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి అరిష్టాలన్నారు ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న. పంటకు చీడ పెట్టినట్టు రాష్ట్రానికి జగన్ చీడ పట్టుకుందన్నారు.రైతులు విలవిలాడుతుంటే గత ప్రభుతంలో చేసిన వాటికి శంఖుస్థాపనలు చేయడం విడ్డూరమన్నారు.జగన్ ఎక్కడ కాపురం ఉంటే అక్కడ సంక్షోభమే అంటూ విమర్శించారు.తాడేపల్లిలో కాపురం తర్వాత విజయవాడ పెద్ద పల్లెటూరు అయ్యిందని,ఇపుడు సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం అంటున్నాడు..అభివృద్ధి పథంలో ఉన్న విశాఖకు విజయవాడ పరిస్థితి ఏర్పడనుందని,దీంతో విశాఖ ప్రజలు వణికిపోతున్నారని అన్నారు.జగన్ ఆస్తులు దోచుకుంటే ప్రజలు తిరుగుబాటు చెయ్యాలని,జగన్ కు బుద్ధి చెప్పడానికి ఉత్తరాంధ్ర ప్రజలు రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. జగన్ స్కూల్ కాబట్టే మంత్రి కారుమూరి ఇష్టానుసారంగా రైతులపై వ్యాఖ్యలు చేసాడని ఫైర్ అయ్యారు.ఈనెల 16,17,18 తేదీల్లో పెందుర్తి, S.కోట, అనకాపల్లిలో రాష్ట్రానికి ఇదేం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని బుద్దా వెంకన్న తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com