ఢిల్లీలో కొత్తగా 1693 కరోనా పాజిటివ్ కేసులు

X
By - Admin |27 Aug 2020 7:07 AM IST
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,764కు చేరింది.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలలో గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. తాజగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తిరిగి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,764కు చేరింది. కరోనా బారి నుంచి కోలుకుని ఒక్కరోజే 1,154 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, ఇప్పటివరకు 1,48,897 మంది రికవర్ అయ్యారని వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు 4,347 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం 12,520మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com